





















pavana.mp3
2018 వ సంవత్సరము నుంచి శ్రీనరసింహస్వామివారికి కళ్యాణ మహోత్సము నిర్వహిస్తున్నాము.
కర్నూలు జిల్లా బనగానపల్లె,రవ్వలకొండపై వెలసిన శ్రీశ్రీశ్రీ చెంచులక్ష్మీ సమేత పావననరసింహస్వామి వారికి 2018 నుంచి కళ్యాణము భక్తుల సహకారంతో ఆలయ కమిటీవారు వైభోపేతముగా నిర్వహిస్తున్నారు. అలాగే 25-03-2021న సాయంత్రం 6 గంటల నుంచి నిర్వహించుటకు ఆలయ కమిటి తీర్మానించినది.కావున భక్తులు సేవకులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదముచేయుటకు సహకరించి, స్వామివారి కృపాకటాక్షములు పొందవలసినదిగ పత్రికా విలేఖురుల సమావేశములో ఆలయవ్యవస్థాపకులు,ధర్మకర్త మరియు అర్చకులు అయిన బాలిశెట్టి పావన నరసింహమూర్తిగారు తెలియజేశారు.
విజ్ఞప్తి
స్వామి వారి భక్తులకు విన్నపము
రవ్వలకొండ శ్రీశ్రీశ్రీ చెంచులక్ష్మీ సమేత పావన నరసింహస్వామి స్వాతి మనొభీష్ట పూజ వ్రత పుస్తకము ఈ దేవాలయము తరపున ప్రచురిస్తున్నాము. ఈ పుస్తక ప్రచురణలో మీ సహకారము కోరుతున్నాము. పుస్తక ప్రచురణలో సహకరించిన వారి వివరాలు యీ పుస్తకములో ప్రచురించబడును.
వివరాలకు ఆలయ కార్యనిర్వహకులను సంప్రదించగలరు.
23-08-2019శ్రీకృష్ణాష్టమిని పురష్కరించుకొని, ఈ దేవాలయము నందు ఉదయము 8గంటలకు పావన నరసింహస్వామి స్వాతి మనొభీష్ట సామూహిక పూజ నిర్వహించబడును. స్వామివారి కృపాకటాక్షములు మరియు మీ మనొభీష్టం పొందగోరువారందరు ఈ పూజలో పాల్గొనవలెను.
పూజలొ కూర్చొనువారు ఈ క్రింది పూజా సామాగ్రి తెచ్చుకోవలయును.
1. శుభమైన వస్త్రము (దేవతల పటాలు,పూజా సామాగ్రి పెట్టుకొనుటకు)
2. పటాలకు సరిపడు పూలమాల మరియు విడిపూలు
3. ధీపం కుందు,వత్తులు,నూనె,అగరత్తులు మరియు కర్పూరము
4. టెంకాయ మరియు అరటి పండ్లు
pavana.mp3